Welcome to the BLISSFUL journey

Day 30 – అమ్మగారికి పాద సేవ చేస్తూ నిద్రపోయినప్పుడు

0

నా అంతరాత్మ పాద సేవ కొనసాగించమంటుంది, చాలా సేపు సతమతమయ్యాను. నేను పాద సేవ చేస్తూ చేస్తూ నిద్రలోకి జారుకున్నాను. నా అవస్థ చూడలేక వెళ్లి పడుకోమన్నారు శ్రీలక్ష్మి గారు. వారు కూడా నాలాగే అంత దూరం నడిచారు కానీ, అమ్మగారికి పాద సేవ చేస్తూ తెల్లవారు ఝామునే మా టెంట్లోకి వచ్చారు.వారిని చూసినప్పుడు అనిపించింది, గురువు పట్ల శ్రద్ధగా ఉంటానని ఆలోచన చెయ్యటమే కాదు, ఆచరణ కూడా ఉండాలని. అది గురువులు నాకు పెట్టిన పరీక్ష అని అర్థమైంది. ఈ సంఘటన నా మనసులో బలంగా నాటుకుపోయింది. అయితే అదే సంవత్సరం మేము హిమాలయ యాత్ర ముగించుకొని వచ్చాక, జులైలో షిర్డీలో గురుపూజ జరిగింది. అప్పుడు శ్రీదేవిగారు, అమ్మగారికి పాద సేవ చేస్తుండగా, ఇటువంటి అనుభవమే వారికి కలిగింది. అమ్మగారికి పాద సేవ చేస్తున్న ఆవిడ, తూలి నిద్రలోకి జారుకోగానే…. మహావతార్ బాబాజీ గారి ఆకారం కనిపించిందట. వారు తీక్షణంగా చూస్తూ “గురువుకు సేవ చేస్తున్నపుడు జాగరూకతతో ఉండాలి” అని చెప్పి అదృశ్యమయ్యారట. ఆవిడ అనుభవం విన్న నాకు వెన్నులో ఒక్కసారిగా చలి పుట్టింది. క్షమించమని గురువులను వేడుకున్నాను.

Share.
Leave A Reply

Kriya Yogi
Typically replies within a day
Kriya Yogi
Om Sushumna 🙏

How can we help you?
6:26
Start Chat